బాధితులకు సత్వర న్యాయం చేసేందుకే గ్రీవెన్స్ డే : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

by Disha Web Desk 1 |
బాధితులకు సత్వర న్యాయం చేసేందుకే గ్రీవెన్స్ డే : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
X

దిశ, సిరిసిల్ల : బాధితులకు సత్వర న్యాయం చేసేందుకే ప్రతి సోమావారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమవారం అర్జీదారుల నుంచి మొత్తం 22 ఫిర్యాదులు ఆయన స్వీకరించి సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. భూ తగాదాలు, ఆస్థి తగాదాల విషయంలో చట్ట ప్రకారం, నిబంధనలకు అనుగుణంగా బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా చూడాలని సూచించారు.

గ్రీవెన్స్ డే ఫిర్యాదులు ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందిస్తున్నామని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూనే, అసాంఘిక శక్తులు, నేరస్థుల పట్ల కఠిన వైఖరి అవలంభిస్తూ శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూస్తామని పేర్కొన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం వల్ల సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.


Next Story

Most Viewed