చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది: ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

by Disha Web Desk 1 |
చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది: ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
X

దిశ, మల్లాపూర్: మండల పరిధిలోని చిట్టాపుర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు అని సూచించారు. ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సరోజన ఆదిరెడ్డి, సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి, ఎమ్మార్వో రవీందర్, గౌర్ నాగేష్, శ్రీనివాస్, మల్లయ్య, లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed