రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం

by Dishanational1 |
రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం
X

దిశ, మల్యాల: జగిత్యాల జిల్లా న‌ర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన రైతు గడ్డం జ‌ల‌ప‌తిరెడ్డి ఆర్థిక ఇబ్బందుల‌తో ఆత్మహ‌త్య చేసుకున్నాడు. కుటంబ ఖ‌ర్చుల కోసం అప్పులు చేశాడు. భూమి లేక‌, మ‌రోవైపు వేరే ఆదాయం లేక కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌య్యాయి. ఈ క్రమంలోనే ఇటీవ‌ల త‌న ఇద్దరు కుమార్తెల‌ను బావిలో తోసేసి తాను పురుగుల మందు తాగి ఆత్మహ‌త్య చేసుకున్నాడు. జ‌ల‌ప‌తి రెడ్డి మరణించగా అతని కూతురు ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడింది. జలపతిరెడ్డి మరణంతో అత‌డి భార్య, కూతురు దిక్కులేని వార‌య్యారు. ఆర్థిక ఇబ్బందుల‌తో బాధ‌ప‌డుతున్న ఆ కుటుంబాన్ని మల్యాల గ్రామానికి చెందిన నల్లపు మల్లేశం పరామర్శించి, తన వంతుగా ఆర్థిక సహాయం రూ. 5000 అందించి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రంలో సంపత్ పటేల్, ప్రశాంత్ గౌడ్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed