రాజీవ్ రహదారిపై రైతుల ధర్నా

by velandi.Saikiran |   (  Updated:2025-08-29 11:36:40  IST  )

మండలంలోని రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజి వద్ద యూరియా కోసం శుక్రవారం ధర్నా నిర్వహించారు రైతులు. డీసీఎంఎస్ సెంటర్

రాజీవ్ రహదారిపై రైతుల ధర్నా
X

దిశ, గన్నేరువరం: మండలంలోని రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజి వద్ద యూరియా కోసం శుక్రవారం ధర్నా నిర్వహించారు రైతులు. డీసీఎంఎస్ సెంటర్ కు యూరియా వస్తుందని సమాచారం మేరకు ఉదయం నుండి అక్కడే పడిగాపులు కాచారు రైతులు. కానీ యూరియా రాకపోవడంతో ఓపిక నశించి రాజీవ్ రహదారిపై ధర్నా నిర్వహించారు. రైతుల ధర్నాతో వాహనాలు పెద్ద మొత్తంలో రాజీవ్ రహదారిపై ఆగిపోయాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.

Next Story