వడ్లు కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కిన రైతులు

by Disha Web Desk 1 |
వడ్లు కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కిన రైతులు
X

దిశ, కోరుట్ల రూరల్ : వడ్లు కొనుగోలు చేసి తమను ఆదుకోవాలంటూ రైతులు రోడ్డెక్కిన ఘటన కోరుట్లలో చోటుచేసుకుంది.వడ్లు కొనుగోలు చేసి తమను ఆదుకోవాలంటూ రైతులు రోడ్డెక్కిన ఘటన కోరుట్లలో చోటుచేసుకుంది. గత నెల రోజులుగా వడ్లు కొనుగోలు చేయడం లేదని, వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కోరుట్ల వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు ధర్నా చేశారు. మండే ఎండలో జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు కొనుగోళ్లు ప్రారంభించే వరకు ధర్నా విరమించేది లేదంటూ నిరసన తెలిపారు. తహసీల్దార్ రాజేశ్, ఎస్ఐ సతీష్ రైతులతో మాట్లాడి కొనుగోళ్లు ప్రారంభించుటకు హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.


Next Story

Most Viewed