రెండు వ్యవసాయ పంపు సెట్లు ఎత్తుకెళ్లిన దొంగలు

by Bhanu |

ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో విత్తనాలు ,ఎరువులు వివిధ రూపాలలో రైతుకు పెట్టుబడి తడిసి మోపెడవుతుంటే మరోవైపు దొంగలు రైతులను నిలువునా ముంచుతున్నారు.

రెండు వ్యవసాయ పంపు సెట్లు ఎత్తుకెళ్లిన దొంగలు
X

దిశ, శంకరపట్నం: ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో విత్తనాలు ,ఎరువులు వివిధ రూపాలలో రైతుకు పెట్టుబడి తడిసి మోపెడవుతుంటే మరోవైపు దొంగలు రైతులను నిలువునా ముంచుతున్నారు. వివరాల్లోకి వెళితే.. శంకరపట్నంమండలంలో ని కేశవపట్నం గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు తోట రవి,గుండారపు కనకరాజంలకు చెందిన వ్యవసాయ పంపుసెట్లు చోరీకి గురైనట్లు తెలిపారు.కేశవపట్నం వాగులో అమర్చుకున్న మోటార్లు, స్టాటర్లు గురువారం వరకు ఉన్నాయని శుక్రవారం నారు మడి దున్నడానికి ఏర్పాట్లు చేసుకొని మోటార్లును చూడగా కనిపించకపోయేసరికి లబోదిబోమన్నారు.చోరీకి గురైన మోటార్ల విలువ దాదాపు 50 వేల వరకు ఉంటుందని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

Next Story