Breaking News..... పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఈటల

by Dishanational1 |
Breaking News..... పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఈటల
X

దిశ, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం అనాథ పిల్లల పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అనాథ పిల్లలకు స్కాలర్షిప్ లు అందిస్తూ, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. వీరికి రానున్న రోజులలో ఎలాంటి లోటు లేకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం ఏమీ చేయడం లేదన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed