- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వనమహోత్సవంతోనే పర్యావరణ పరిరక్షణ..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని హుజురాబాద్ పురపాలక సంఘ చైర్పర్సన్ సుహాసినీ రోంటాల పిలుపునిచ్చారు.

దిశ,హుజురాబాద్ రూరల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని హుజురాబాద్ పురపాలక సంఘ చైర్పర్సన్ సుహాసినీ రోంటాల పిలుపునిచ్చారు. మంగళవారం హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చైర్పర్సన్ అధ్యక్షతన వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘ పాలకవర్గ సభ్యులకు మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ.. పెరుగుతున్న కాలుష్య నివారణకు, భవిష్యత్ తరాల మనుగడకు చెట్లు నాటడం ఎంతో అవసరమని, ప్రజలందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గూడూరి అంజలి, వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులతో పాటు మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, ఇంచార్జి రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, సీనియర్ సహాయకులు శ్రీమతి వాణి, ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ పి. వినయ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.






