ఎమ్మెల్యే రాసిచ్చిన బాండ్ పేపర్ కు పిండ ప్రదానం

by Disha Web Desk 1 |
ఎమ్మెల్యే రాసిచ్చిన బాండ్ పేపర్ కు పిండ ప్రదానం
X

కొండ్రికర్ల గ్రామస్థుల వినూత్న నిరసన

దిశ, మెట్ పల్లి : మండల పరిధిలోని కొండ్రికర్ల గ్రామంలో గ్రామస్థులు ఎమ్మెల్యే రాసిచ్చిన బాండ్ పేపర్ కు పిండ ప్రదానం చేశారు. గత ఎంపీటీసీ ఎన్నికల సమయంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరో గ్రామస్థుడైన మారు సాయిరెడ్డిని తమ గ్రామంలో గెలిపించమని.. అందుకు తమ ఊరు వాగుపై రెండేళ్లలో బ్రిడ్జి నిర్మిస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి నాలుగేళ్లు పూర్తయినా.. ఎలాంటి నిర్మాణం చేయలేదు. తమ ఊరి అభివృద్ధి కోసం బ్రిడ్జి నిర్మాణం అయితే వేములవాడకు చుట్టుపక్కల ఊర్లకు రోడ్డు సౌకర్యం ఏర్పడుతుందని, అదేవిధంగా రైతులు, గీతా కార్మికులకు వర్షాకాలం 20 కి.మీ. చుట్టూ తిరిగే బాధ తప్పుతుందని గ్రామస్థులు ఆశపడ్డారు.

బ్రిడ్జి నిర్మాణం చేపడతామని చెప్పి ఎమ్మెల్యే బాండ్ పేపర్ రాసిస్తే.. గ్రామస్థులంతా... మారు సాయిరెడ్డిని గెలిపించారు. రెండేళ్లలో పూర్తి చేస్తామన్న బ్రిడ్జి నాలుగేళ్లే గడచినా.. పనులు మాత్రం ప్రారంభం కాలేదని కొండ్రికర్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మె్ల్యే రాసిచ్చిన బాండ్ పేపర్ కు ఆదివారం నాలుగో సంవత్సరం పిండ ప్రదానం చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల రాజగంగు, ఉప సర్పంచ్ గంట రాజేశ్వర్, మారు జనార్ధన్ రెడ్డి, ఆనంద్, బద్దం రమేష్, సంకు రాకేష్, సబ్బని అశోక్, మెండే జలంధర్ గ్రామస్థలు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed