బావిలో పడి వృద్ధుడు మృతి..

by Kodari Anjali |

ప్రమాదవశాత్తు కాలు జారి వృద్ధుడు బావిలో పడిన ఘటన కోరెపల్లి గ్రామంలో జరిగింది.

బావిలో పడి వృద్ధుడు మృతి..
X

దిశ, జమ్మికుంట: జమ్మికుంట మండలం కోరెపల్లి గ్రామానికి చెందిన కొండవేన పోశాలు (56) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.ఇంటి దగ్గర ఉన్న బావిలో ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు పోశాలకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.పోశాలు మృతితో కోరెపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story