అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి 50వేల రూపాయల విరాళం..

by Disha Web Desk 20 |
అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి 50వేల రూపాయల విరాళం..
X

దిశ, రుద్రంగి : రుద్రంగి మండలం కేంద్రంలో నిర్మిస్తున్న డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ కాంస్య విగ్రహ నిర్మాణానికి డాక్టర్ చెన్నమనేని వికాస్ 50వేల రూపాయలను గురువారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు తండ్రి బాటలోనే పేద ప్రజలకు వైద్య సేవలు, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, చరిత్ర మూర్తుల చరిత్ర విశిష్టతను తెలిసేలా వారి విగ్రహాల స్థాపనకు విరాళాలు అందజేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు.

సేవా తత్పర హృదయాలు చెన్నమనేని కుటుంబానికి చెందింది అని వారిని కొనియాడారు. విగ్రహ నిర్మాణానికి సహకారం కావాలని కోరగానే వెంటనే స్పందించి ఆర్థిక సహకారాలు అందించిన డాక్టర్ వికాస్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పడాల గణేష్, అంబేద్కర్ ఐక్య సంఘం సభ్యులు గసికంటి రాజు, దయ్యాల నారాయణ, మరంపల్లి రాజ్ కుమార్, గంగరాజు, దాసరి గంగరాజు, కట్కూరి దాసు, అక్కనపెల్లి శ్రీనివాస్, దయ్యాల శ్రీనివాస్ అంబటి దేవానందం శ్రీనివాస, పాటు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed