పెగడపల్లి వాసికి డాక్టరేట్

by Disha Web Desk 1 |
పెగడపల్లి వాసికి డాక్టరేట్
X

దిశ, పెగడపల్లి : ఢిల్లీలోని గ్లోబల్ పీస్ ఆఫ్ హ్యూమనిటీ యూనివర్సిటీ నుంచి మండల కేంద్రానికి చెందిన బత్తుల ప్రదీప్ శనివారం గౌరవ డాక్టరేట్ పొందారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో జరిగిన డాక్టరేట్ ప్రధానోత్సవ కార్యక్రమంలో గ్లోబల్ పీస్ ఆఫ్ హ్యూమనిటీ ఫౌండర్ చైర్మన్ డా.మాన్యుల్, తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి వేంకటేశన్, కేంద్ర మంత్రి డా.రాందాస్ అథావలె, తమిళనాడు ప్రిన్సిపాల్ సెక్రటరీ సంపత్ కుమార్ చేతుల మీదుగా ప్రదీప్ డాక్టరేట్ ను అందుకున్నారు. తాను చేసిన సామాజిక సేవలను గుర్తించి అత్యున్నత డాక్టరేట్ ప్రదానం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డాక్టరేట్ పొందిన ప్రదీప్ ను పలువురు నాయకులు, గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.



Next Story