డిజిటల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ ''దిశ'': T-BJP చీఫ్ బండి సంజయ్

by Disha Web Desk 19 |
డిజిటల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ దిశ: T-BJP చీఫ్ బండి సంజయ్
X

దిశ, కరీంనగర్: వైవిధ్యమైన వార్తలు అందిస్తూ పాఠకుల హృదయాల్లో మరింత సుస్థిర స్థానం సంపాదించుకునే దిశగా 'దిశ' ముందుకు సాగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. శనివారం కరీంనగర్ మహాశక్తి ఆలయంలో దిశ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాస్తవిక కోణంలో వార్తలు అందిస్తూ ఎప్పటికప్పుడు కవరేజ్ చేయడంలో దిశ బృందం పడుతున్న శ్రమ అభినందనీయమన్నారు.

తెలుగు పాఠకుల్లో నయా ట్రెండ్ క్రియేట్ చేసిన పత్రిక ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజ సమస్యలను వెలుగులోకి తీసుకరావడంతో పాటు చారిత్రాత్మక నేపథ్యం ఉన్న వార్తలను అందించేందుకు కృషి చేయాలని బండి సంజయ్ సూచించారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో డిజిటల్ మీడియా పది కాలాల పాటు పదిలంగా నిలిచేవిధంగా పని చేయాల్సిన బాధ్యత 'దిశ' యంత్రాంగంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు శివరామయ్య, దిశ కరీంనగర్ బ్యూరో ఇంఛార్జి శివనాద్రి ప్రమోద్ కుమార్, రిపోర్టర్ సతీస్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed