- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ ఘాతంతో అపార నష్టం.. 40 గొర్రెల మృతి 35 గొర్రెల అస్వస్థత
by Bhanu |
విద్యుత్ ఘాతంతో గొర్రెలు మృత్యువాత పడ్డ సంఘటన మండలంలోని చామనపల్లి గ్రామంలో జరిగింది.

X
దిశ, ధర్మారం: విద్యుత్ ఘాతంతో గొర్రెలు మృత్యువాత పడ్డ సంఘటన మండలంలోని చామనపల్లి గ్రామంలో జరిగింది. చామనపల్లి గ్రామంలోని దాడి ఓదయ్య, దాడి ఐలయ్య, ఓరుగల మల్లయ్య, ఆవుల భూమయ్యల గొర్రెలు రోజు వారిగా మేతకు తీసుకెళ్లారు. అయితే.. ఈ క్రమంలోనే నీరు తాగడానికి వాగులోకి వెళ్లిన గొర్రెలు విద్యుత్ ఘాతంతో మృతి చెందడంతో బాధితులు వారి కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
గొర్ల కాపర్ల వృత్తితో జీవనం కొనసాగిస్తున్న వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఈ సంఘటనలో 40 గొర్రెల మృతి చెందగా 35 గొర్రెల అస్వస్థతకు గురయ్యాయి. వాగు పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి ఉన్న విద్యుత్ వైరు వాగులో పడటంతో ప్రమాదం జరిగింది అని స్థానికులు చెబుతున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






