కేటీఆర్ సభను అడ్డుకుంటాం.. కాంగ్రెస్ కార్యకర్తలు

by Dishafeatures2 |
కేటీఆర్ సభను అడ్డుకుంటాం.. కాంగ్రెస్ కార్యకర్తలు
X

దిశ, జమ్మికుంట: కేటీఆర్ సభను అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి హెచ్చరించారు. జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. హుజురాబాద్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ ఏ ఒక్క హామీని నెరవేర్చేలేదని ఆరోపించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదని మండిపడ్డారు. ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ సభ నిర్వహించే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ బహిరంగ సభను ఎలా నిర్వహిస్తారో చూస్తామని హెచ్చరించారు. సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తామని చెప్పారు. జమ్మికుంటలో ఎలాంటి అనుమతులు లేకండా అడ్డగోలుగా ఇసుక దందా నడుస్తోందని, రోడ్లు ఎక్కడికక్కడ నాశనం అయ్యాయని తెలిపారు.

ఇవేమీ పట్టించుకోని బీఆర్ఎస్ నాయకులు.. బహిరంగా సభను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌషిక్ రెడ్డి ఒక మహిళ అని కూడా చూడకుండా గవర్నర్ తమిళి సై పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. అసలు జిల్లాలో ఎమ్మెల్సీ కౌషిక్ రెడ్డి పర్యటన సమయంలో ఆయనకు ఎందుకు అంత భారీ భత్రతనిస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. ఉద్యోగాలు పెట్టిస్తానని అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసినందుకే అంత సెక్యూరిటీ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. పెంచిన ఏసీడీ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.



Next Story