వసతి గృహాల ఆధునీకరణ పనులు పూర్తి చేయండి: కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

by Disha Web Desk 11 |
వసతి గృహాల ఆధునీకరణ పనులు పూర్తి చేయండి: కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
X

దిశ, పెద్దపల్లి: ఈ నెల 20వ తేది నాటికి సుల్తానాబాద్ మండలంలో చేపట్టిన ఎస్సీ బాలుర వసతి గృహం ఆధునీకరణ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం సుల్తానాబాద్ మున్సిపాలిటీ లోని ఎస్సీ బాలుర వసతి గృహం ఆధునీకరణ పనులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. జిల్లాలో ఉన్న 9 షెడ్యూల్ కులాల వసతి గృహాల ఆధునీకరణ కోసం ప్రభుత్వం ప్రతి హాస్టల్ కు రూ. 5 లక్షల చొప్పున గతంలో రూ. 45 లక్షలు మంజూరు చేసిందని, వాటిలో నుంచి ఇప్పటివరకు 6 షెడ్యూల్ కులాల వసతి గృహాల పనులు పూర్తి చేయడం జరిగిందని అధికారులు కలెక్టర్ కూ వివరించారు.

జిల్లాలో పెండింగ్ లో ఉన్న 3 షెడ్యూల్ కులాల వసతి గృహాల ఆధునీకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, హాస్టల్స్ లో తాగునీటి సరఫరా, పారిశుధ్యం, అవసరమైన విద్యుత్ మరమ్మత్తులు వంటి సదుపాయాలు కల్పిస్తూ పోస్ట్ మెట్రిక్ వసతి గృహంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ యాకన్న, ఎంపీడీవో శశికళ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed