మెట్ పల్లిలో సబ్ కోర్ట్ ప్రారంభం

by Disha Web Desk 1 |
మెట్ పల్లిలో సబ్ కోర్ట్ ప్రారంభం
X

దిశ, మెట్ పల్లి: జగిత్యాల జిల్లా పరిధిలోని మెట్ పల్లిలో శనివారం నూతన సీనియర్ సివిల్ జడ్జ్ సబ్ కోర్ట్ ను రాష్ట్ర హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ బుయాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ బృందం న్యాయమూర్తులకు గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి లు నవీన్ రావు, జువ్వడి శ్రీదేవి, అనుపమ చక్రవర్తి, సంతోష్ రెడ్డి, పుల్ల కార్తీక్, ప్రిన్సిపాల్ జిల్లా జడ్జి నీలిమ, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జిల్లా ఎస్పీ భాస్కర్, డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ లక్ష్మినారాయణ, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం ఎస్సైలు, మెట్ పల్లి బార్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story