ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

by Dishanational2 |
ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
X

దిశ, గన్నేరువరం: కాంగ్రెస్ వార్ రూమ్ పై పోలీసుల దాడికి నిరసనగా టీపీసీసీ పిలుపు మేరకు గన్నేరువరం మండల కేంద్రంలో సీఎం దిష్టిబొమ్మను డీసీసీ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ లో దాడికి పాల్పడి ఆఫీసులో ఉన్నటువంటి డాటాను తెలంగాణ పోలీసులు ధ్వంసం చేయడం హేయమైన చర్య అని, దీనిని తెలంగాణ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు, అవినీతిపై ప్రశ్నించినందుకు ఇటువంటి దాడులకు పాల్పడడం తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చిటుకూరి అనంతరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మెర రవీందర్ రెడ్డి, నాయకులు ముల్కల మల్లేశం, ఉపేందర్, మాతంగి అనిల్, చింతల శ్రీధర్ రెడ్డి, నల్ల చంద్రారెడ్డి అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed