కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సీఎం కేసీఆర్

by Disha Web Desk 12 |
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సీఎం కేసీఆర్
X

దిశ, మల్యాల, కొడిమ్యాల: ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దర్శించుకున్నారు. బుధవారం జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ నుంచి ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్ కు ఆలయ అధికారులు, పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. సీఎం వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు రవిశంకర్, సంజయ్, విద్యాసాగర్ రావు, దాసరి మనోహర్ రెడ్డి, కోరు కంటి చందర్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

Next Story

Most Viewed