108లో ప్రసవం.. తల్లీ, బిడ్డ క్షేమం

by Disha Web Desk 1 |
108లో ప్రసవం.. తల్లీ, బిడ్డ క్షేమం
X

దిశ, శంకరపట్నం: మండలం పరిధిలోని కేశవపట్నం పరిధిలో సోమవారం 108 అంబులెన్స్ లో ఓ మహిళ ప్రసవించింది. వివరాల్లోకి వెళితే.. ఎరడపల్లి గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ బీ పురిటి నొప్పులతో బాధపడుతూ ఉండగా స్థానికులు కుటుంబ సభ్యులు108 కు ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన కేశవపట్నం 108 సిబ్బంది ఈఎంటీ ఐలయ్య, పైలట్ శ్రీనివాస్ షేక్ హుస్సేన్ బీని మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా తరలిస్తుండగా మార్గామాధ్యలో నార్మల్ డెలివరీ చేయగా మగబిడ్డకు జన్మనిచ్చిందని. దీంతో ఇరువురిని వెంటనే కేశవపట్నం పీహెచ్సీకి తరలించినట్లు, తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని 108 వాహన సిబ్బంది, కుటుంబ సభ్యులు తెలిపారు.



Next Story