అక్రమంగా ఇసుక తరలిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు

by Bhanu |

కరీంనగర్ మండలం చేగుర్తి గ్రామ శివారు ప్రాంతమైన మనేర్ వాగు నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న డ్రైవర్ తో పాటు ట్రాక్టర్ ని అదివారం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు
X

దిశ, కరీంనగర్ రూరల్ : కరీంనగర్ మండలం చేగుర్తి గ్రామ శివారు ప్రాంతమైన మనేర్ వాగు నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న డ్రైవర్ తో పాటు ట్రాక్టర్ ని అదివారం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, చేగుర్తి గ్రామానికి చెందిన పత్తి అజయ్ తన సొంత ట్రాక్టర్ తో తానే డ్రైవర్ గా వ్యవహరిస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.భవిష్యత్తులో ఇసుక అక్రమ తరలింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ఏ.నిరంజన్ రెడ్డి హెచ్చరిచారు.

Next Story