స్వరాష్ట్రంలో మారిన పల్లెల రూపురేఖలు : మంత్రి గంగుల కమలాకర్

by Disha Web Desk 1 |
స్వరాష్ట్రంలో మారిన పల్లెల రూపురేఖలు : మంత్రి గంగుల కమలాకర్
X

దిశ, కరీంనగర్ టౌన్ : ప్రజల మనసు చూరగొనేలా ప్రజాప్రతినిధులు పని చేసి ప్రజల చేత మన్ననలు పొందాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండల సర్వసభ్య సమావేశానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమైక్య పాలనలో పల్లెలకు రహదారులు కనీస సౌకర్యాలు లేక నానా అవస్థలు పడేవారని గుర్తు చేశారు. నేడు స్వయం పాలనలో రూ.కోట్ల నిధులతో చేపట్టిన పనులతో పల్లెల రుపురేఖలు మారిపోయయాని అన్నారు.

కరీంనగర్ రూరల్ మండలంలో పెండింగ్ పనులన్నింటి కోసం రూ.16 కోట్ల నిధులను మంజూరు చేశామని తెలిపారు. ఈ పనులకు టెండర్లు కూడా పూర్తయ్యాయని త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తామని తెలిపారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్ తోనే సాధ్యమని, ప్రజలు ఆ విషయంలోపూర్తిస్థాయి విశ్వాసంతో ఉన్నారని అన్నారు. కేసీఆర్ తోనే తమ పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉంటుందని ప్రజలు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. పల్లెల్లో నేడు ప్రతి ఇంటికి తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతున్నాయని.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారని, గతంలో ప్రజలను పాలించిన ఆ పార్టీలు మళ్లీ అధికారంలోకి వస్తే చీకటి రోజులు వస్తాయని అన్నారు. ప్రజలు పని చేసే ప్రభుత్వానికే పట్టం కడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గోపి, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, జడ్పీ సీఈవో వీర బుచ్చయ్య, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, జడ్పీటీసీ పురమల్ల లలిత, పాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, ఎంపీడీవో జగన్ మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Next Story