చెరువులో మునిగి పశువుల కాపరి మృతి..

by Kodari Anjali |

కాపరి ప్రమాదవశాత్తు ఊర చెరువులో నీట మునిగి మృతి చెందాడు.

చెరువులో మునిగి పశువుల కాపరి మృతి..
X

దిశ, వెల్గటూర్: కొండాపూర్ గ్రామానికి చెందిన ఎలుక లస్మయ్య (68) అనే పశువుల కాపరి ప్రమాదవశాత్తు ఊర చెరువులో నీట మునిగి మృతి చెందాడని.. ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. ఇతడు గ్రామంలోని బర్రెలు మేపుకుంటూ జీవిస్తాడు. శుక్రవారం గ్రామంలోని బర్రెలను మేపుకుంటూ చెరువు వద్దకుల్లి, రాత్రి అయిన తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి చెరువులో శనివారం జాలరులతో వెతకగా లస్మయ్య శవం దొరికింది. అయితే చెరులోపలికి వెళ్లిన బర్రెలను బయటకు రప్పించే ప్రయత్నంలో లోపలికి వెళ్లిన లస్మయ్య, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించాడని, అతని భార్య ఎలుక దేవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Next Story