ప్రమాదం సంభవిస్తే కానీ పట్టించుకోరా..?

by Nallavelli.Anjaneyulu |

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేట గ్రామంలోని ఎస్సీ కాలనీలో గల నమిలికొండ దేవరాజు ఇంటి వద్ద విద్యుత్ వైర్లు కిందికి ఉండడంతో ప్రజలు భయాందోళన గురవుతున్నారు.

ప్రమాదం సంభవిస్తే కానీ పట్టించుకోరా..?
X

దిశ, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేట గ్రామంలోని ఎస్సీ కాలనీలో గల నమిలికొండ దేవరాజు ఇంటి వద్ద విద్యుత్ వైర్లు కిందికి ఉండడంతో స్థానిక ప్రజలు భయాందోళన గురవుతున్నారు. ఈ విద్యుత్ వైర్లు కిందికి వేలాడడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సెస్ అధికారులు స్పందించి ఈ ఈ విద్యుత్ వైర్లు ద్వారా ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు. ప్రమాదం జరిగితే కానీ పట్టించుకోరా అని కాలనీవాసులు, గ్రామస్తులు వాపోతున్నారు. త్వరితగతిన సంబంధిత సెస్ అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని సర్పంచ్ కల్లూరి బాపురెడ్డి, ప్ర‌జ‌లు కోరుతున్నారు.

Next Story