BREAKING: కరీంనగర్ విద్యార్థినులకు కేంద్రం గుడ్ న్యూస్.. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా

by Disha Web Desk 1 |
BREAKING: కరీంనగర్ విద్యార్థినులకు కేంద్రం గుడ్ న్యూస్.. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ కరీంనగర్ విద్యార్థినులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు కరీంనగర్ ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలకు అటానమస్ హోదాను తక్షణమే కల్పించాలని కోరుతూ.. శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కాగా, మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా కల్పించాలని ఫిబ్రవరి 16న కేంద్రానికి బండి సంజయ్ లేఖ రాశారు. దీంతో ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని కేంద్రం అటానమస్ హోదా కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ కేంద్ర మానవ వనరుల అభవృద్ధి శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.



Next Story

Most Viewed