- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బక్రీద్ రోజున కోరుట్లలో కలకలం
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గురువారం రాత్రి మూగ జంతువు ఎముకలు రోడ్డుపై కనిపించడం కలకలం రేపింది.

బక్రీద్ రోజున కోరుట్లలో కలకలం
రోడ్డుపై ఆవు ఎముకలు పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు
అప్రమత్తమైన పోలీసులు
దిశ, కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గురువారం రాత్రి మూగ జంతువు ఎముకలు రోడ్డుపై కనిపించడం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, పట్టణంలోని ముత్యాలవాడ వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు, మూగ జంతువు ( ఆవు) కాళ్లు, ఇతర ఎముకలను రోడ్డుపై పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కోరుట్ల సీఐ లక్ష్మీనారాయణ, తన సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
బక్రీద్ పర్వదినం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులో ఉంచారు. ఈ ఘటనపై పలు హిందూ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశంతోనే కొందరు కావాలనే ఈ చర్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు.






