సైదాపూర్ లో బీజేపీ ధర్నా రాస్తారోకో

by Elthuri vijay kumar |

సైదాపూర్ లో బీజేపీ ధర్నా రాస్తారోకో
X

సైదాపూర్ లో బీజేపీ ధర్నా రాస్తారోకో

- పోలీసులకు కార్యకర్తలకు తోపులాట

- సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

- మోడీ పటానికి క్షీరాభిషేకం

దిశ,సైదాపూర్ : కాంగ్రెస్ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేయడాన్ని నిరసిస్తూ సైదాపూర్ మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద మంగళవారం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హుజురాబాద్ హుస్నాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు బీజేపీ కార్యకర్తల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. అనంతరం బీజేపీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story