రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడ్డ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

by Disha Web Desk 20 |
రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడ్డ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
X

దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎకరాకు రూ.30 వేల పరిహారం యుద్దప్రాతిపదికన రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. నిర్ణీత వ్యవధిలో కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉంటే 30 శాతం రైతులు నష్టపోయేవాళ్లు కాదన్నారు. చేతికొచ్చిన పంట నీళ్లపాలై రైతులు అల్లాడుతున్నారన్నారు. కౌలు రైతుల దుస్థితి వర్ణణాతీతంగా ఉందంటూ సీఎం కేసీఆర్ పై ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఇది ఎన్నికల ఏడాది. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు కదా... నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవం సందర్భంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేలో రూ.40 వేల సాయం చేసే ఫైలుపై సంతకం చేస్తాడేమో అనుకున్నానన్నారు.

కానీ అవేవీ చేయకుండా రైతులను మోసం చేసిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ప్రశ్నించే వాళ్లను వాడు, వీడు అని సంబోధిస్తున్నడని, కేసీఆర్ కు అహంకారం తలకెక్కిందన్నారు. కేసీఆర్... అసలు నీ బతుకేంది ? తెలంగాణ ఉద్యమానికంటే ముందు నీ బతుకేందో మాకు తెల్వదా ? అధికారం ఉందనే అహంకారం, వేల కోట్ల అక్రమ సంపాదించారనే మదంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నడు... పోయే కాలం దాపురించిదంటూ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా ? అనే అనుమానం కలుగుతోందన్నారు. రైతులను ఆదుకోవాల్సిన మంత్రులు ఇతరులపైకి నెపం నెట్టి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో తడిసిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబోసుకుంటున్న రైతుల వద్దకు వెళ్లి బాధలు తెలుసుకున్నారు. గంభీరావుపేట సమీపంలోని ఐకేపీ కేంద్రంలో బతుకమ్మ చీరలతో తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టుకుంటున్న రైతులను కలిశారు. అనంతరం నాగంపేట గ్రామంలో వడగంల వానలతో నీట మునిగిన పొలాలను పరిశీలించారు. రైతులు పడుతున్న బాధలను అడిగి తెలుసుకున్నారు.

సిరిసిల్ల జిల్లాలో 1.7 లక్షల ఎకరాల్లో పంట సాగు చేస్తే రైతులు సగానికిపైగా నష్టపోయారని తెలిపారు. అధికారులు మాత్రం 17 వేల ఎకరాల్లోనే పంట నష్టమైందని ఫీల్డ్ మీదకు పోకుండా లెక్కలు రాస్తున్నరన్నారు. ఫీల్డ్ కు వెళితే ఒక లెక్క... వెళ్లకపోతే వాళ్లకు ఒక బాధ. నిన్న ఒక ఆఫీసర్ ను సస్పెండ్ చేశారట. మరి ఫీల్డ్ కు వెళ్లని సీఎంను ఏం చేయాలి అంటూ ఎద్దేవా చేశారు. రైతులు అల్లాడుతుంటే కేసీఆర్ ఢిల్లీ ఏం చేయడానికి పోయిండు ? రైతులంటే లెక్కలేదా ? మార్చిలో అకాల వానలతో 5 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింటే... కరీంనగర్ జిల్లాలో సీఎం పర్యటించి 2.8 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నదని చెప్పి ఎకరానికి రూ.10 కోట్ల చొప్పున 288 కోట్లు విడుదల చేస్తున్నానన్నడు. వారం రోజుల్లో పరిహారం ఇస్తానన్నడు. ఇంతవరకు పైసా ఇయ్యలేదంటూ ఆగ్రహించారు. వాళ్ల లెక్కల ప్రకారమే 70 వేల మంది రైతులు చనిపోయారు. ఈసారి పంట పూర్తిగా నష్టపోయారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా... వడ్ల కొనుగోళ్లు మాత్రం ఇంతవరకు ప్రారంభించలే.

ఐకేపీ కేంద్రాల్ల ధాన్యం వర్షానికి తడిసి ముద్దయినయ్. కొనుగోళ్లు ప్రారంభించి ఉంటే 30 శాతం రైతులకు నష్టపోయేవాళ్లు కాదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే రైతులు ఇబ్బంది పడుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ఎకరానికి రూ.30 వేల పెట్టుబడి అదనంగా ఖర్చుపెట్టారు పురుగు నివారణ కోసం... ఇగ కౌలు రైతుల బాధలు వర్ణణాతీతం. అప్పు తెచ్చి కౌలు చేశారు. అప్పు తీర్చలేరు.. కౌలు ఇయ్యలేడు... తిండికి వెళ్లని పరిస్థితి ప్రభుత్వం పంపే నివేదికలు మూడు రకాలుగా ఉంటది. పంట నష్టం అంచనా నుండి తుది నివేదిక వరకు తేడాలే. చివరకు రైతులకు 8 ఏళ్లుగా నయాపైసా సాయం చేయలే. ప్రజలను దారి మళ్లించేందుకు సచివాలయం ప్రారంభం పేరుతో డ్రామాలు... తీరా చూస్తే సచివాలయం కూడా లీకులే. ఇది లీకుల ప్రభుత్వం. పేపర్ లీకేజీ, ప్రభుత్వ లీకేజీలతోనే కాలయాపన చేస్తున్నరన్నారు. ముఖ్యమంత్రి జిమ్మిక్కులు చేయడంలో నేర్పరి. ఆయన ఫెయిల్యూర్ పెద్ద నిదర్శనం సచివాలయానికి ఎదురుగానే ఉన్న హుస్సేన్ సాగర్.

ఆ నీళ్లను శుద్ధి చేసి కొబ్బరినీళ్లలా మారుస్తానని ఇఛ్చిన హామీనే అమలు చేయని మూర్ఖుడు కేసీఆర్ అని అన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని సీఎం కేసీఆర్. రుణమాఫీ, సబ్సిడీ యూరియా, విత్తనాలు, నిరుద్యోగ భ్రుతి, డబుల్ బెడ్రూం ఇండ్లు సహా ఏ హామీలను అమలు చేయలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతుల కోసం ఎకరాకు ఎరువులు, కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రూ.30 వేల సబ్సిడీ ఇస్తున్నడన్నారు. రుణమాఫీ చేయకపోవడంతో రైతులకు బ్యాంకులు అప్పులియ్యడం లేదు. చివరకు బ్యాంకు మెట్లు కూడా ఎక్కనీయడం లేదు. రైతులకు ఏనాడూ ఒక్కసారి కూడా బోనస్ ఇయ్యని దుర్మార్గుడు. కేసీఆర్ పాలనలో ఏ రైతు కూడా లక్షాధికారి కావాలని కోరుకోవడం లేదు. జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికే వ్యవసాయం చేస్తున్నరు. పీజీలు చేసిన నిరుద్యోగులు ఉద్యోగాలియ్యకపోవడంతో వ్యవసాయం చేసుకుంటున్నరు. తీరాచూస్తే పంట నష్టపోయి బాధపడుతున్నరు.

చేతికొచ్చిన బిడ్డ పోతే తండ్రి ఎంత బాధపడుతారో.... చేతికొచ్చిన పంట పోయి రైతులు అట్లా బాధపడుతున్నరు. నిన్న ట్విట్టర్ టిల్లు వచ్చి మళ్లీ రైతులను ఆదుకుంటున్నట్లు కోతలు కోసిండు.. ఏం సాయం చేసిండో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రం జాతీయ విపత్తు నిధి కింద రాష్ట్రానికి రూ. 3వేల కోట్లు మంజూరు చేస్తే ... అందులో రైతులకు ఎంత ఇచ్చావో చెప్పాలన్నారు. అసలు ఆ నిధులను ఏ విధంగా ఖర్చు చేశావో సమాధానం చెప్పాలి. నిత్యం కేంద్రంపై పడి ఏడవడం సిగ్గుచేటు... కర్నాటకలో ఎన్నికలు జరిగితే మహారాష్ట్రకు పోయి ప్రచారం చేస్తున్న బాపతు కేసీఆర్ అని అన్నారు. చివరకు మహారాష్ట్రలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎన్నికలు జరిగితే ఒక్క స్థానం కూడా గెలవకుండా చిత్తుగా ఓడిపోయిన పార్టీ బీఆర్ఎస్ కు బీజేపీ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. ఇకనైనా కేసీఆర్ ప్రభుత్వం మేల్కొని నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.30 వేల సాయం అందించాలన్నారు. కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కింది. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు రైతులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed