బీజేపీలోకి భోగ శ్రావణి

by Dishanational1 |
బీజేపీలోకి భోగ శ్రావణి
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బాధ్యతల నుండి తప్పుకోవడంతోపాటు కౌన్సిలర్ పదవికి, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన భోగ శ్రావణి బుధవారం బీజేపీ గూటికి చేరారు. ఈ మేరకు ఢిల్లీలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ సమక్షంలో శ్రావణి, ఆమె భర్త భోగ ప్రవీణ్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.



Next Story