ఉపాధి హామీ కూలీల పై తేనెటీగల దాడి.. వంద మందికి పైగా గాయాలు

by Dishanational2 |
ఉపాధి హామీ కూలీల పై తేనెటీగల దాడి.. వంద మందికి పైగా గాయాలు
X

దిశ, కొడిమ్యాల :కొడిమ్యాల మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీల పై తేనెటీగల దాడి జరిగి సుమారు వంద మందికి పైగా గాయపడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.కూలీలు తెలిపిన వివరాల ప్రకారం మంగళ వారం ఉదయం బూరుగు కుంట ప్రాంతంలో కులీలు పనిలో నిమగ్నమై వుండగా అకస్మాత్తు గా తేనెటీగలు దాడి చేసాయని తెలిపారు.దాడి జరిగన సమయంలో సుమారు రెండు వందల మంది పనిచేస్తున్నట్లు వారు తెలిపారు.గాయపడిన వారిని స్థానిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స ను అందించారు.తీవ్రంగా గాయపడ్డా పది మంది నీ జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించి నట్లు ఈజీఎస్ ఏపివో సతీష్ తెలిపారు.

Next Story

Most Viewed