ఔదార్యం చాటుకున్న ఆరోవార్డు కౌన్సిలర్ బాకం సాయికిరణ్

by Ratna Kumari |

పదోతరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల‌కు ఆరో వార్డు కౌన్సిల‌ర్ బాకం సాయి కిర‌ణ్ శుక్ర‌వారం 30 మంది విద్యార్థుల‌కు ప‌రీక్ష ప్యాడ్స్, పెన్నులు, పెన్సిళ్లు అంద‌జేశారు.

ఔదార్యం చాటుకున్న ఆరోవార్డు కౌన్సిలర్ బాకం సాయికిరణ్
X

దిశ, సుల్తానాబాద్ : పదోతరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల‌కు ఆరో వార్డు కౌన్సిల‌ర్ బాకం సాయి కిర‌ణ్ శుక్ర‌వారం 30 మంది విద్యార్థుల‌కు ప‌రీక్ష ప్యాడ్స్, పెన్నులు, పెన్సిళ్లు అంద‌జేశారు. ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ సాయికిరణ్ మాట్లాడుతూ పదో తరగతిలో విద్యార్థులు ప్రతిభ కనబరచాలని, ప్రతి ఒక్కరు మొదటి ర్యాంకులో ఉత్తీర్ణత సాధించాలని కోరారు. విద్యార్థిని, విద్యార్థులకు తన సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని సాయికిరణ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దేవేందర్, కిరణ్, హేమన్ రాజు, సోహన్ రాజు, మామిడిపల్లి శ్రీకాంత్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story