వ‌డ్ల లోడ్ తో వెళ్తున్న ట్రాక్ట‌ర్ ఢీ కొట్టిన ఆర్టీసీ బ‌స్సు

by Ratna Kumari |

వడ్ల లోడుతో రైస్ మిల్లు కు వెళ్తున్న ట్రాక్టర్ ని వెనుక నుంచి ఆర్టీసీ రాజధాని ఏసీ బస్సు ఢీ కొట్టిన సంఘటన తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ రాజీవ్ రహదారి పై సోమవారం రాత్రి చోటు చేసుకుంది.

వ‌డ్ల లోడ్ తో వెళ్తున్న ట్రాక్ట‌ర్ ఢీ కొట్టిన ఆర్టీసీ బ‌స్సు
X

దిశ, తిమ్మాపూర్ : వడ్ల లోడుతో రైస్ మిల్లు కు వెళ్తున్న ట్రాక్టర్ ని వెనుక నుంచి ఆర్టీసీ రాజధాని ఏసీ బస్సు ఢీ కొట్టిన సంఘటన తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ రాజీవ్ రహదారి పై సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. వడ్ల బస్తాలు రోడ్డుపై పడి చల్ల చదురు కావడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. బస్సు ఓవర్ స్పీడ్ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.

Next Story