దుబాయ్‌లో జాక్ పాట్ కొట్టిన కరీంనగర్ యువకుడు.. రూ. 30 కోట్ల లాటరీ గెలుపు

by Disha Web Desk 19 |
దుబాయ్‌లో జాక్ పాట్ కొట్టిన కరీంనగర్ యువకుడు.. రూ. 30 కోట్ల లాటరీ గెలుపు
X

దిశ, జగిత్యాల టౌన్: ఉన్న ఊరిలో ఉపాధి లేక దుబాయ్ వెళ్ళిన ఆ యువకుడిని అదృష్టం వరించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రాత్రికి రాత్రి 30 కోట్లకు యజమానిని చేసింది. వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగుర్‌కు చెందిన ఓగుల దేవరాజం- ప్రమీలలా కుమారుడు అజయ్ బతుకుదెరువు కోసం ఇటీవల దుబాయ్‌కి వలస వెళ్ళాడు. అక్కడ డ్రైవర్‌గా విధుల్లో చేరాడు. దుబాయ్‌లో 15 దిర్హమ్‌లు పెట్టి ఎమిరేట్స్ డ్రాలో లాటరీ కొన్నాడు. కాగా, డ్రాలో అదృష్టం అజయ్‌నే వరించింది. ఈ విషయం తెలుసుకున్న అజయ్ స్వగ్రామంలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. అజయ్ 30 కోట్లు డ్రా గెలుచుకోవడం పట్ల అతని బంధువులు, మిత్రులు, గ్రామస్థులు సంతోషం వెలిబుచ్చారు.



Next Story

Most Viewed