- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు
పోలీస్ స్టేషన్ వద్ద ఓ యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, కరీంనగర్ రూరల్ : పోలీస్ స్టేషన్ వద్ద ఓ యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో వరంగల్ జిల్లా కి చెందిన వరుణ్ అనే యువకుడు కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరికి డిజిటల్ యాప్స్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ యువతిని ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకోవాలంటూ రోజు ఫోన్ చేస్తూ వేధించడంతో ఈ విషయాన్ని గమనించిన యువతి తల్లిదండ్రులు కరీంనగర్ రూరల్ పోలీసులకు సమాచారం అందించారు.
మంగళవారం పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని అడ్రస్, ఐడీ ప్రూఫ్ తదితర వివరాలను స్వీకరించారు. అయితే యువకుడు పొంతన లేని సమాధానం చెప్పాడు. అయితే ఆ అమ్మాయిని తన వెంట పంపించాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. మంగళవారం రాత్రి స్టేషన్ వద్ద పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకోవడం ఇప్పుడు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. వెంటనే పోలీసులు ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్తితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనలో పోలీసులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరుణ్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఎందుకు నిప్పు అంటించుకున్నాడనే సందేహాలు కలుగుతున్నాయి. పోలీసులు అతని పై ఏమైనా దురుసుగా ప్రవర్తించారా..? లేక ఏమైనా జరిగిందా అని రకరకాలుగా అనుమానాలు కలగడం గమనార్హం.






