కరీంపేటలో దారుణం.. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు

by Kodari Anjali |   (  Updated:2026-06-08 09:46:23  IST  )

ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్న ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కరీంపేట గ్రామంలో జరిగింది.

కరీంపేటలో దారుణం.. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న  యువకుడు
X

దిశ, మానకొండూరు, శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కరీంపేట గ్రామానికి చెందిన ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న సంఘటన గ్రామంలో కలకలం రేపింది . వివరాల్లోకి వెళితే... శంకరపట్నం మండలంలోని తాడికల్ సహకార సంఘంలో ఆఫీస్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న బొజ్జ మహేందర్ అనే యువకుడు ఆఫీసుకు వెళ్లకుండా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటి పై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు గన్ని సంచులతో మంటలను ఆర్పి వేశారు. స్థానికులు 108 కి సమాచారం అందించడంతో క్షతగాత్రున్ని హుటాహుటిన హుజరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Next Story