ఇసుక ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి

by Dishanational2 |
ఇసుక ట్రాక్టర్ ఢీకొని  మహిళ మృతి
X

దిశ, జమ్మికుంట : జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి వద్ద టీవీఎస్ ఎక్సెల్‌ను ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇల్లంతకుంట మండలం శ్రీరాముల పల్లికి చెందిన గుత్తికొండ తిరపతమ్మ అక్కడికక్కడే మరణించింది. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కాగా, ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ట్రాక్టర్ ఓ వర్ స్పీడే కారణం అంటున్నారు స్థానికులు. ఇక ఈ అక్రమ ఇసుక రవాణా పట్టించుకోవాల్సిన అధికారులు, వారితోనే చేతులు కలుపుతున్నారని, అందుకే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు.



Next Story

Most Viewed