మంత్రి కొప్పులకు ఘన స్వాగతం..

by Disha Web Desk 1 |
మంత్రి కొప్పులకు ఘన స్వాగతం..
X

దిశ, వెల్గటూర్ : సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు బుధవారం ధర్మపురి నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలికారు. మరోసారి కొప్పులకు సీఎం కేసీఆర్ టికెట్ ఖరారు చేసిన తర్వాత తొలిసారి ఆదిలాబాద్ జిల్లా నుంచి రాయపట్నం వద్ద ధర్మపురి నియోజకవర్గంలో అడుగుపెట్టగా వేలాది మంది బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ఈ నేపథ్యంలో ధర్మపురి నియోజకవర్గంలోని వెల్గటూరు ధర్మారం పెగడపల్లి, బుగ్గారం, గొల్లపల్లి, ధర్మపురి మండలాల నుంచి వేలాది మంది నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీతో వచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాయపట్నం కూడలి గులాబీమయమైంది. మంత్రి కొప్పుల ఓపెన్ టాప్ వాహనంలోకి ఎక్కి టీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేయగా అందరూ సంతోషం వ్యక్తం చేసి నినాదాలతో హోరెత్తించారు. అనంతరం బైక్ ర్యాలీతో మంత్రి ధర్మపురికి వెళ్లారు.


Next Story