కారు, బైక్ ఢీకొని విద్యార్థి మృతి

by Disha Web Desk 1 |
కారు, బైక్ ఢీకొని విద్యార్థి మృతి
X

దిశ, కాల్వ శ్రీరాంపూర్: కారు, బైక్ ఢీకొని ఓ విద్యార్థి మృతిచెందిన ఘటన మండల పరిధిలోని గంగారం గ్రామ శివారులో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హన్మకొండ నుంచి మంచిర్యాలకు వెళ్తున్న కారు మంగపేటలోని తెనుగు పల్లె ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఆరేపల్లి శ్రీనివాస్ తన ఇద్దరు కుమారులతో మంగపేట నుంచి శ్రీరాంపూర్ తన ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గంగారం గ్రామం దగ్గర కారు, శ్రీనివాస్ బైక్ ను బలంగా ఢీకొట్టడంతో పెద్ద కొడకు మనోక్షిత్ తీవ్ర గాయలై అక్కడికక్కడే మృతి చెందాడు.

స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి ఎస్ఐ రాజవర్ధన్ మృతదేహన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి మార్చురికి తరలించారు. అదేవిధంగా ఆరేపల్లి శ్రీనివాసులు చిన్న కొడుకు సాయి కీర్తన్ కు గాయాలు కాగా మండల కేంద్రం లోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజవర్ధన్ తెలిపారు.



Next Story

Most Viewed