చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

by Ratna Kumari |

చేప‌ల వేట‌కు వెళ్లి వ్య‌క్తి మృతి చెందిన సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని నంద‌గిరి గ్రామంలో చోటు చేసుకుంది.

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
X

దిశ,పెగడపల్లి : చేప‌ల వేట‌కు వెళ్లి వ్య‌క్తి మృతి చెందిన సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని నంద‌గిరి గ్రామంలో చోటు చేసుకుంది. స్తానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండ‌ల ప‌రిధిలోని నంద‌గిరి గ్రామానికి చెందిన తౌట్ రాజేశం ఉపాధి నిమిత్తం త‌మ గ్రామ చెరువులోకి చేప‌లు ప‌ట్ట‌డానికి వెళ్లి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. తోటి గ్రామ‌స్తులు అంబులెన్స్ కి కాల్ చేయ‌గా అంబులెన్స్ సిబ్బంది వ‌చ్చి చూశారు. రాజేశం అప్ప‌టికే మృతి చెందాడ‌ని తెలిపారు. మృతునికి భార్య‌, కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుని భార్య కేత‌వ్వ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన‌ట్టు ఎస్సై కిర‌న్ కుమార్ తెలిపారు.

Next Story