మహిళ దారుణ హత్య.. బంధువుల ఆందోళన

by Disha Web Desk 1 |
మహిళ దారుణ హత్య.. బంధువుల ఆందోళన
X

దిశ, గంభీరావుపేట: మహిళ మృతదేహం లభ్యమైన ఘటన మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన బేరిగి నర్సవ్వ (40) తన వ్యక్తిగత పనుల నిమిత్తం ఈనెల 15న ఉదయం కామారెడ్డికి వెళ్లింది. చికటి పడినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడి బంధువులు, తెలిసిన వాళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో నర్సవ్వ బంధవులు ఈనెల 15న రాత్రి కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామ శివారులోని చెరువులో ఓ మహిళ మృతిదేహం లభ్యమైందంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న కామారెడ్డి పోలీసులు మృతదేహం బైరి నర్సవ్వదిగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నర్సవ్వను ఎక్కడో హత్య చేసి, కొత్తపల్లి చెరువులో పడి వేశారని, ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు కామారెడ్డి టౌన్ సీఐ నరేష్ తెలిపారు.

నిందితులను కఠినంగా శిక్షించాలంటూ బంధువుల ఆందోళన..

మంగళవారం ఉదయం మృతదేహం లభ్యం కాగా, సాయంత్రం వరకు మృతదేహాన్ని బయటకు తీయకపోవడంతో ఆగ్రహించిన నర్సవ్వ బంధువులు కామారెడ్డి-సిద్దిపేట ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో అక్కడికి చేరుకున్న ఎస్సై మహేష్ బంధువులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు.


Next Story