గుడ్‌న్యూస్: జిల్లాల్లో ఇవాళ్టి నుంచే ప్రారంభం

by Disha Web Desk 2 |
గుడ్‌న్యూస్: జిల్లాల్లో ఇవాళ్టి నుంచే ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి అన్ని జిల్లాల్లో కంటి వెలుగు క్యాంపులు ప్రారంభం కానున్నాయి. ఆధార్​కార్డు వివరాలతో రిజిస్ట్రేషన్ చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు. అంధంత్వ నివారణే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కేవలం 100 రోజుల్లో కోటిన్నర మందికి పరీక్షలు పూర్తి చేసి అద్దాలు, ఆపరేషన్లు నిర్వహించాలని సర్కార్​లక్ష్యం పెట్టుకున్నది. సమర్థవంతంగా ఈ టాస్క్‌ను పూర్తి చేసుకొని గిన్నిస్​బుక్‌లో రికార్డు సొంతం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోన్నది. వారంలో ఐదు రోజుల పాటు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్యాంపులు కొనసాగనున్నాయి. ఒక మెడికల్ ఆఫీసర్‌తో పాటు మరో ఏడుగురు మెంబర్లు కలిపి ఒక టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఆప్ట్రోమెట్రిస్ట్, సూపర్ వైజర్​ఆఫీసర్, ఇద్దరు ఏఎన్ఎంలు, ముగ్గురు ఆశాలు, ఒక డీఈవోలు టీమ్‌లో ఉండనున్నారు. పూర్తిగా ఏఆర్​మిషన్‌తో కంప్యూటీకరణ విధానంలో ప్రజలకు పరీక్షలు చేయనున్నారు. పరీక్షలు తర్వాత కేవలం రెండు వారాల్లో ఏఎన్ఎంలు అద్దాలు పంపిణీ చేయనున్నారు. ఇక పరీక్షల క్వాలిటీ చెక్​చేసేందుకు జిల్లాకో కంట్రోల్​టీమ్​పనిచేయనున్నది. ప్రతీ టీమ్‌కు ఓ వాట్సాప్​గ్రూప్‌ను క్రియేట్​ చేశారు. రోజులో చేసిన కంటి పరీక్షలు, అద్దాలు పంపిణీ, సర్జరీల రిఫర్లు వంటి వివరాలను ఆ గ్రూప్​లో సాయంత్రానికి పోస్టు చేయాల్సి ఉంటుంది.

అద్దెకు వాహనాలు

కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం అద్దెకు వాహనాలను తీసుకొని టీమ్‌లకు సమకూర్చినది. గవర్నమెంట్ వద్ద వెహికల్స్​లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. గురువారం నుంచి షురూ కానున్న కంటి వెలుగు కార్యక్రమం జూన్​ 15 వరకు జరుగుతుంది. ఓవరల్​గా 12,768 రూరల్​ ప్రాంతాల్లో, 3788 అర్బన్​ ప్రాంతాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గ్రామ పంచాయితీ, వార్డుల వారీగా టెస్టింగ్​ప్రాసెస్‌ను నిర్వహిస్తారు. ఒక్కో రోజు క్యాంపు నిర్వహణకు ప్రభుత్వ టీమ్‌కు రూ. 1500 చొప్పున అలవెన్స్​ఇవ్వనున్నది. పుడ్, అకామ్ డేషన్‌కు వినియోగించాలని సూచించింది. క్యాంపులలో వాడే లాజిస్టిక్, టేబుల్స్, చైర్ల రెంట్‌కు మరో వెయ్యి రూపాయలు చొప్పున ఇవ్వనున్నారు. వీటిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్​రిలీజ్ చేయనున్నారు. టీమ్‌లు స్టే చేసేందుకు మండల, జిల్లా హెడ్​క్వార్డర్స్‌ను ప్రభుత్వం సమకూర్చుతున్నది. డీఎమ్‌హెచ్​వోలతో పాటు పంచాయితీ రాజ్, మున్సిపల్ అధికారులు కంటి వెలుగు కార్యక్రమాన్ని రెగ్యులర్‌గా మానిటరింగ్ చేయనున్నారు.

Also Read....

సిటీలో 29 మోడల్ కారిడార్లు



Next Story

Most Viewed