- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Kadiyam Srihari: రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కడియం శ్రీహరి.. ఆ రెండు డిమాండ్లకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్!
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్డెస్క్: అంతా ఊహించిన విధంగానే జరిగింది. ఇవాళ మినిస్టర్స్ క్వార్టర్స్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యహరాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్యను కలిశారు. అనంతరం వారిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అందుకు కడియం కూడా సూచనాప్రాయంగా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్లో చేరాలంటే ఆయన రెండు షరతులు పెట్టినట్లుగా తెలుస్తోంది. వరంగల్ ఎంపీ టికెట్ తనకు ఇవ్వాలని కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీని కోరినట్లుగా సమాచారం. ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని.. ఆ స్థానంలో తన కూతురుకి అవకాశం ఇవ్వాలని కోరగా అందుకు రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు, ఏఐసీసీ కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన రేపు, ఎల్లుండి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్లో చేరనున్నారని సమాచారం.
Next Story