ఇది కవిత, కేసీఆర్, కేటీఆర్ కచరా పాలనకి నమూనా: బండి సంజాయ్

by Disha Web Desk 12 |
ఇది కవిత, కేసీఆర్, కేటీఆర్ కచరా పాలనకి నమూనా: బండి సంజాయ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : కల్వకుంట్ల కుటుంబంది కచరా పాలన అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆదివారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. బీజేపీ మంత్రం- నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఫ్యామిలీ లాస్ట్. కానీ బీఆర్ఎస్ నినాదం- కుటుంబం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పీపుల్ లాస్ట్ అని బండి సంజయ్ సెటైర్లు వేశారు. ఇది కవిత, కేసీఆర్, కేటీఆర్ కచరా పాలనకి నమూనా అన్నారు. గత 9 ఏళ్లలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే ధనవంతులయ్యారని, పేదలు, నిరుద్యోగులు మాత్రం కష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొన్నారు. ఇక ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వంలో మాత్రమే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు.


Next Story