కేసీఆర్ తక్షణమే రాజీనామా చెయ్: కేఏ పాల్

by Disha Web Desk 2 |
కేసీఆర్ తక్షణమే రాజీనామా చెయ్: కేఏ పాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ కుటుంబం అవినీతి ఆకాశానికి అంటుకుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు దోచుకోవడం, దాచుకోవడం దాన్ని పంచుకోవడం అలావాటుగా మారిందని ఆరోపించారు. శుక్రవారం సోషల్ మీడియా వేదికగా మాట్లాడిన ఆయన కవితను కాపాడేందుకు మంత్రులు, పోలీసులు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఢిల్లీలో కూర్చుంటే రాష్ట్ర పరిపాలన ఎవరు చూస్తానని ప్రశ్నించారు.

అందుకే కేసీఆర్, కేటీఆర్, కవిత తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని ఒకవేళ ఉంటే తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని దళితుడిని ముఖ్యమంత్రి చేయాలన్నారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించేలా ప్రతిఒక్కరిని ఆహ్వానిస్తున్నానన్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు ఎలా లీక్ అయ్యాయనేది దర్యాప్తు చేస్తేనే అసలు నిజం ఏంటో తెలుస్తుందన్నారు. నిరుద్యోగులు, విద్యార్థులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మంచి రోజులు రాబోతున్నాయని చెప్పారు.


Next Story