- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రానికి జస్టిస్ పీసీ ఘోష్.. కేసీఆర్, హరీశ్, ఈటల విచారణ తేదీలు ఖరారు
కాళేశ్వరం కర్త కర్మ క్రియగా అన్ని తానే అని చెప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును విచారణకు పిలవాలని కాళేశ్వరం కమిషన్ నిర్ణయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం కర్త కర్మ క్రియగా అన్ని తానే అని చెప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును విచారణకు పిలవాలని కాళేశ్వరం కమిషన్ నిర్ణయించింది. అయితే ఆయనను ఏ తేదీన విచారణకు పిలవాలి, అనేది సోమవారం దాదాపుగా నిర్ణయం కానుందని సమాచారం. కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్కు చేరుకున్నారు. సోమవారం ఉదయం కమిషన్సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో ఏవరేవరికి నోటిసులు జారీ చేయాలని, ఏ తేదీన వారిని పిలిపించాలనే విషయాలను ఖరారు చేస్తారు. కేసీఆర్విచారణతో కాళేశ్వరం విచారణ దాదాపుగా ముగిసినట్లేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇంజనీర్లు, నిపుణులు, అధికారులు అందరు కూడా కాళేశ్వరం మూడు బ్యారేజీల నిర్మాణం, వాటి స్థలం ఖరారు, నీటిని నిల్వ చేయడం తదితర అంశాలన్నింటిని కేసీఆర్నిర్ణయం ప్రకారమే తాము ఫాలో అయ్యామని, నిబంధనలకు విరుద్దంగా ఉన్నా కూడా కొన్ని పనులు చేయాల్సి వచ్చిందని, ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా తమ నిర్ణయాలను చేప్పే పరిస్థితి లేదని వారు కమిషన్ముందు చెప్పారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ విచారణపై రాష్ట్రం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కేసీఆర్కూడా విచారణకు మానసికంగా సిద్దమైనట్లుగా సమాచారం. బ్యారేజీల నిర్ణయాన్ని ఏ విధంగా సమర్ధించుకోవాలి, అనే సమాచారాన్ని కూడా సిద్దం చేసుకున్నట్లుగా సమాచారం. కేసీఆర్తో పాటుగా అప్పటి సాగు నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్లను విచారణ కు పిలవాలని నిర్ణయించారు. అయితే వీరిని ఏ తేదీన విచారణ కు పిలచేతి తేల నుంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు పీసీ ఘోస్కమిషన్ గడువు ఉంది. ఇప్పటి వరకు విచాణ పూర్తి కాని వారిలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మేడిగడ్డ బ్యారేజీ నిర్మించిన ఎల్అండ్టీ సంస్థ వైస్ప్రసిడెంట్, కాగ్, విజిలెన్స్అధికారులు విచారణకు హాజరుకావాల్సి ఉంది. వీరిని ఈ వారంలో పిలిచే అవకాశం ఉంది.






