18న ఇందిరాపార్కులో జర్నలిస్టుల మహా ధర్నా!

by Dishafeatures2 |
18న ఇందిరాపార్కులో  జర్నలిస్టుల  మహా ధర్నా!
X

దిశ, తెలంగాణ బ్యూరో: జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్స్‌ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ(జేఎన్‌జే మ్యాక్‌ హెచ్‌ఎస్‌) జర్నలిస్టులు పదహారేళ్ళ క్రితం కొనుగోలు చేసిన పేట్‌బషీరాబాద్‌లోని 38 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సొసైటీకి కేటాయించాలని కోరుతూ ఈనెల 18న హైదరాబాదులోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో జర్నలిస్టులు మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ మహాధర్నాకు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీల నేతలు, ‍ప్రజాసంఘాల నేతలు ఈ ధర్నాలో పాల్గొంటున‍్నట్లు జేఎన్‌జే హౌసింగ్‌ సొసైటీ ఫౌండర్‌ మెంబర్‌ పీవీ రమణారావు ఒక ప్రకటనలో తెలియజేశారు.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ మహా ధర్నా జరుగుతోందన్నారు.సుప్రీం కోర్టు తీర్పు వచ్చి 10 నెలలు గడిచిపోయినా రాష్ట్ర ప్రభుత్వం పేట్‌ బషీరాబాద్‌ భూమిని తమ సొసైటీకి స్వాధీనం చేయకపోవడంతో జెఎన్‌జె హౌసింగ్‌ సొసైటీ సభ్యులు ఈ మహాధర్నా చేపడుతున్నట్లు రమణారావు తెలిపారు. ఈ మహాధర్నాలో జేఎన్‌జే హౌసింగ్‌ సొసైటీ సభ్యులు తమ కుటుంబాలతో పెద్ద సంఖ్యలో పాల్గొంటునట్లు ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.



Next Story

Most Viewed