Bus crash : జీడిమెట్లలో బస్సు బీభత్సం..ఒకరి మృతి

by Y. Venkata Narasimha Reddy |

జీడిమెట్ల(Jedimetla)లో బస్సు బీభత్సం(bus crash) సృష్టించింది. అదుపు తప్పిన రామకృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బస్సు షాపూర్ నగర్ లో రోడ్ క్రాస్ చేస్తున్న వ్యక్తిని ఢీకొట్టింది.

Bus crash : జీడిమెట్లలో బస్సు బీభత్సం..ఒకరి మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : జీడిమెట్ల(Jedimetla)లో బస్సు బీభత్సం(bus crash) సృష్టించింది. అదుపు తప్పిన రామకృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బస్సు షాపూర్ నగర్ లో రోడ్ క్రాస్ చేస్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. బస్సు అతడిని చౌరస్తా నుండి సాగర్ హోటల్ వరకు ఈడ్చుకెళ్ళింది. ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని జీహెచ్ఎంసీ(GHMC 23) సర్కిల్ ఇంచార్జ్ హరికృష్ణ(Harikrishna)గా గుర్తించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సృష్టించిన బీభత్సంలో మరికొందరు వాహనదారులు గాయపడగా, పలు వాహనాలు దెబ్బతిన్నాయి.

కాగా ప్రమాదంలో మరణించిన తమ ఉద్యోగి కుటుంబానికి న్యాయం చేయలంటూ జీహెచ్ఎంసీ సిబ్బంది రహదారిపై ఆందోళన చేపట్టారు. ఆందోళనతో ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Next Story