ఘనంగా జాహ్నవి మాస్టర్ చెఫ్ కాంపిటీషన్

by Dishafeatures2 |
ఘనంగా జాహ్నవి మాస్టర్ చెఫ్ కాంపిటీషన్
X

దిశ, వెబ్ డెస్క్: జాహ్నవి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ ఆద్వర్యంలో కవాడిగూడలో సోమవారం జాహ్నవి మాస్టర్ చెఫ్ కాంపిటీషన్-23 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జాహ్నవి విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ రోషిణి హాజరయ్యారు. ఈ వేడుకలో హైదరాబాద్‌లోని తొమ్మిది హోటల్ మేనేజ్ మెంట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులు హజరైయ్యారు. ఈ సందర్భంగా వివిధ రకాల వంటకాలను ప్రదర్శించారు. ఫైర్‌లెస్ వంటకాల ద్వారా విలేజ్ బ్యాక్ గ్రౌండ్‌లో పేరుపోందిన వంటకాలను ప్రదర్శించారు.


ఇక ఈ కాంపిటీషన్ లో మొదటి బహుమతి చెన్నయ్ అమృత కాలేజీ, ద్వితీయ బహుమతి జాహ్నవి కాలేజ్, తృతీయ బహుమతి ఆర్కే డిగ్రీ కాలేజీలు గెలుచుకున్నాయి. ఈ ప్రైజ్‌ మనీని చైర్మన్ ఏ. పరమేశ్వర్ విజేతలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాహ్నవి విద్యాసంస్థల చైర్మన్ పరమేశ్వర్, మేనేజింగ్ డైరెక్టర్ రోషిణి, అకడమిక్ డైరెక్టర్ నర్సింగరావు, ప్రిన్సిపాల్ ఏక్తా, ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు.


Next Story