Kavitha: మళ్లీ మాట్లాడితే చెప్పులతో కొడుతాం.. వి. ప్రకాశ్ కు జాగృతి నేతల వార్నింగ్

by Prasad Jukanti |   (  Updated:2025-09-08 13:40:59  IST  )

వి. ప్రకాశ్ కు జాగృతి నేతల వార్నింగ్ ఇచ్చారు.

Kavitha: మళ్లీ మాట్లాడితే  చెప్పులతో కొడుతాం.. వి. ప్రకాశ్ కు జాగృతి నేతల వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యరో/ డైనమిక్ బ్యూరో: జాగృతి అధ్యక్షురాలు కవితపై (Kavitha) అవాకులు చవాకులు పేలితే చెప్పులతో దాడి చేస్తామని తెలంగాణా వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వి. ప్రకాశ్ (V. Prakash) ను జాగృతి నేతలు హెచ్చరించారు. ఆడబిడ్డపై వ్యక్తిగత విమర్శలు చేసే స్థాయికి దిగజారవు. నీ వెనుక ఎవరుండి మాట్లాడిస్తున్నారు? అని మండిపడ్డారు. ఇవాళ జూబ్లీహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జాగృతి (Jagruthi) నేతలు.. మీకు కూడా బిడ్డ ఉంది కదా.. వ్యక్తిగత విమర్శలు చేసే కుసంస్కృతి మా అధ్యక్షురాలు మాకు నేర్పలేదన్నారు. ఆడబిడ్డ పై మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే భౌతిక దాడులు తప్పవని హెచ్చరించారు.

నీ వాటా ఎంతా?:

గడ్డి తిని మొరుగుతున్న వి.ప్రకాశ్ మేధావివి కాదు మేత ఆవు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు ఐ డ్రీమ్ అనే సంస్థకు ప్యాకేజీ ఇచ్చి మాట్లాడిస్తున్నారని ప్రకాశ్ ఎంత ప్యాకేజీకి అమ్ముడు పోయావ్ అని ప్రశ్నించారు. కవిత విషయంలో వి. ప్రకాష్ ఇవ్వాళ నీ అక్కసు ఏందీ? కవిత మాట్లాడితే నీ బండారం బయటపడుతుందని ఫ్రస్ట్రేట్ అవుతున్నావ్ అని అన్నారు. కాళేశ్వరం అవినీతిలో నీకు కూడా వాటా ఉందని హరీష్ రావు, మెగా కృష్ణారెడ్డి పేర్లు బయటకు వస్తే నీ పేరు కూడా బయటకు వస్తదని నీ అక్కసా? అని నిలదీసారు. నీ కూసాలు కదులుతున్నాయనే కవిత పేరు చెప్పగానే ఫ్రస్ట్రేట్ అవుతున్నావ్ అని మండిపడ్డారు. వాటర్ రిసోర్స్ మేనేజ్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నీ వాటా ఎంత?అని ప్రశ్నించారు.

అమ్ముడు పోయింది మీరు కాదా?

బీసీని అని చెప్పుకుంటూ మున్నూరు కాపు సంఘంలో చిచ్చులు పెట్టింది మీరు కాదా? అభ్యుదయ వాది మారోజు వీరన్న ను చంపించిన నరరూప హంతకుడు మీరు అని అని ఆరోపించారు. మారోజు వీరన్న కు సంబంధించిన నిధులను కాజేసేందుకు చంద్రబాబుతో కుమ్మక్కు అయింది మీరని, తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు సమైక్య పార్టీలకు అమ్ముడు పోలేదా అని ప్రశ్నించారు. దేవేందర్ గౌడ్ తో నవ తెలంగాణ పార్టీ పెట్టించిన దుర్మార్గుడు మీరు కాదా? కపిలవాయి దిలీప్ తో తెలంగాణ విమోచన పార్టీ పార్టీ పెట్టించింది మీరు కాదా? అన్నారు. కేసీఆర్ కు అవినీతి మరకలు అంటుస్తున్నది ఎవరని కవిత ప్రశ్నించారు. ఆ అంశంపై మాట్లాడే దమ్ము లేదా? అని నిలదీశారు. మీ తోబుట్టువు కవిత పై ఇలాంటి అవాకులు పేలితే కేటీఆర్ మాట్లాడకపోవటం బాధాకరం అని కవితక్క పై చేసిన ఆరోపణలపై మీరు నోరు మెదకపోతే ఎందుకు రామన్న? అని ప్రశ్నించారు. క్వాంటమ్, అమ్ వే ల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన చరిత్ర వి. ప్రకాష్ దని ఆరోపించారు.

Next Story