మియాపూర్​ ఇస్కాన్ ​ఆధ్వర్యంలో 28న జగన్నాథ రథయాత్ర

by Ajay Maddhiboyina |

అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ( ఇస్కాన్​) మియాపూర్​కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 28న జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నామని

మియాపూర్​ ఇస్కాన్ ​ఆధ్వర్యంలో 28న జగన్నాథ రథయాత్ర
X

దిశ, తెలంగాణ బ్యూరో: అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ( ఇస్కాన్​) మియాపూర్​కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 28న జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నామని మియాపూర్​ఇస్కాన్​టెంపుల్​అధ్యక్షులు శ్రీరాందాస బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్​చందానగర్​లోని ఆర్ఎస్​.బ్రదర్స్​వద్ద నుండి ఈ రథయాత్ర ప్రారంభం అవుతుందని అక్కడి నుండి మదీనాగూడ, ఆల్విన్​క్రాస్​రోడ్​, మియాపూర్​క్రాస్​రోడ్​, జేపీ నగర్​వీధుల గుండా కొనసాగుతూ విశ్వనాథ గార్డెన్​వద్ద ముగుస్తుందని తెలిపారు.

ఆ రథయాత్ర దారి పొడవునా భక్తుల సౌకర్యార్థం పులిహోర ప్రసాదాలు, మంచినీరు అందిస్తామన్నారు. ఈ యాత్ర లో వివిధ రకాల కీర్తనలు, నృత్యాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా కొనసాగుతుందన్నారు. అదే రోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు విశ్వనాథ గార్డెన్​లో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు, పలువురి ప్రసంగాలు ఉంటాయన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందని, కనుక జగన్నాథ రథయాత్ర లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని శ్రీరాందాస విజ్ఞప్తి చేశారు.

Next Story